Entertainment

NBK111 : మరో విధ్వంసానికి ముహూర్తం పెట్టిన బాలయ్య – గోపీచంద్ మలినేని

వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు నిర్మించనున్నారు.

Additionally Learn : The RajaSaab : సంక్రాంతి రేసులో రెబల్ స్టార్ రాజాసాబ్‌ దూకుడు

NBK111 టైటిల్ తో తెరకెక్కుస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సినిమా రెండు వేరు వేరు కాలాలకు చెందిన స్టోరీ అని చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఒకరకంగా టైమ్ ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని బాలయ్యను మునుపెన్నడు చూడని విధంగా పవర్ఫుల్ గా ఉండబోతుందట అందుకు తగ్గట్టే దర్శకుడు కొన్ని రోజుల క్రితం మొరాకోలో అనౌన్స్‌మెంట్ వీడియో తీశాడు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని ప్రకటన రాబోతుంది. టెక్నికల్ టీమ్ విషయంలోను మేకర్స్ ఎక్కడ కంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమాకు సీనిమాటోగ్రాఫర్ గా కాంతార కు పని చేసిన అర్వింద్ కశ్యప్ ను తీసుకున్నారు. ఇక సంగీత దర్శకుడిగా బాలయ్య ఆస్థాన వాయిద్యుడు తమన్ వర్క్ చేయబోతున్నారు. బాలయ్య కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ వర్క్ ఫిల్మ్ అవుతుందని ఈ చిత్ర కథ తెలిసిన కొందరు టాలీవుడ్ సిర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *