పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం స్పిరిట్ కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా అనౌన్స్ చేసే మూడేళ్లు దాటింది. అయినప్పటికీ హైప్ అలానే ఉంది. అయితే ఫైనల్ గా ఈ సినిమా షూట్ పై సాలిడ్ న్యూస్ వినిపిస్తోంది.
దీని ప్రకారం స్పిరిట్ ఈ నవంబర్ మొదటి వారం లోనే పట్టాలెక్కే విధంగా సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలు వరకు ఈ మొదటి షెడ్యూల్ లో మేకర్స్ తెరకెక్కించేస్తారని ఇప్పుడు తెలుస్తోంది. సో మొత్తానికి మాత్రం స్పిరిట్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
The put up పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.