బన్నీ వాస్ తనకు ఇష్టమైన కథలను నిర్మించడానికి సొంత బ్యానర్ “బన్నీ వాస్ వర్క్స్” ప్రారంభించారు. అతని తదుపరి చిత్రం “మిత్ర మండలి” దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే అతని చిన్న బడ్జెట్ మూవీ “లిటిల్ హార్ట్స్” 2.5 కోట్లతో నిర్మించబడింది, కానీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.50 కోట్ల వసూళ్లు సాధించింది. విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, బండ్ల గణేష్ తదితరులను ఆహ్వానించి గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో బండ్ల గణేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ప్రధాన నటుడు మౌళిని ఉద్దేశించి, “విజయ్ లేదా మహేష్ బాబు తో పోల్చవద్దు” అని, నటులు ఫేమ్ కంటే నైపుణ్యంపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు.
Additionally Learn : Mirai : ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మూవీ
అయితే, ఈ వ్యాఖ్యలు వేడుకల్లో అందరికి అసంబద్ధంగా అనిపించాయి. అయితే తాజాగా ఈ విషయంపై బన్నీ వాస్ అసౌకర్యంగా, కొంత నిరాశగా ఉన్నట్టు తెలిపారు. వేదికపై స్పందించాలి అనుకున్నప్పటికి, వేడుక ప్రశాంతంగా జరగాలి అనే ఉద్దేశంతో సైలెంట్ గా ఉన్నట్లు తెలిపారు. తరువాత అయిన ఈ విషయం పై బండ్ల గణేష్కు కాల్ చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు అని తెలిపారు వాసు. గణేష్ వ్యాఖ్యలో ఉద్దెశం ఏదైనప్పటికి సక్సెస్ మీట్ సందర్భంలో అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది. అని తెలిపారు. మొత్తానికి “మిత్ర మండలి” ప్రమోషన్స్ సందర్భంలో ఈ చిన్న సంఘటన చాలా మందికి చర్చా పదంగా మారింది.