Entertainment

Mass Jathara: ఆ విషయంలో చరిత్ర సృష్టించిన ‘మాస్ జాతర’

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ విడుదల తేదీ విషయంలో ఒక ఆసక్తికర చర్చ నడిచింది. అక్టోబర్ 31న విడుదల కావాల్సిన ఈ సినిమా, అదే రోజున విడుదలవుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ ప్రభావం వల్ల నవంబర్ 1కు మారుతుందని అంతా భావించారు. ‘బాహుబలి ది ఎపిక్’ అంటే, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ ఈ రెండు భాగాలను కలిపి ఒకేసారి ప్రదర్శించడం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ అద్భుతంగా ఉండటంతో, ‘బాహుబలి ది ఎపిక్’ దూకుడుకు ‘మాస్ జాతర’ కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు.

Additionally Learn :Chiranjeevi: నన్ను ఇంకా కించపరుస్తూనే ఉన్నారు.. చిరంజీవి మరో కంప్లైంట్

అయితే, ఈ ప్రచారానికి తెరదించుతూ, ‘మాస్ జాతర’ ట్రైలర్ రిలీజ్‌తో పాటు అధికారిక విడుదల తేదీని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, సినిమా విడుదల తేదీని అక్టోబర్ 31నే సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ షోస్తో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. సాధారణంగా, స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్ షోస్‌ను విడుదల తేదీకి ఒక రోజు ముందు లేదా అదే రోజు అర్థరాత్రి ప్రారంభిస్తారు. OG: అక్టోబర్ 25న విడుదల అయితే, 24 రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ వేశారు. పుష్ప 2: డిసెంబర్ 6న వస్తే, 5న ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. కానీ, ‘మాస్ జాతర’ మాత్రం, ఏకంగా ప్రీమియర్ రిలీజ్ డేట్‌ను అధికారిక విడుదల తేదీగా ప్రకటించిన మొదటి చిత్రంగా నిలిచింది.

Additionally Learn :Prabhas: ప్రభాస్ అంటే సీక్వెల్ పక్కా.. కానీ అయ్యే పనేనా?

దీనికి తోడు, ‘బాహుబలి ది ఎపిక్’ ప్రీమియర్స్ అక్టోబర్ 30 రాత్రి నుంచే మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో, అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ను సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్స్ ద్వారా విడుదల చేయడం, థియేటర్ల లభ్యత మరియు కలెక్షన్ల పరంగా ‘బాహుబలి ది ఎపిక్’ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చేసిన వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, అక్టోబర్ 31న ఒకవైపు రవితేజ ‘మాస్ జాతర’ ప్రీమియర్స్‌తోనూ, మరోవైపు రాజమౌళి ‘బాహుబలి ది ఎపిక్’తోనూ థియేటర్లలో ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *